Monday, August 17, 2009

నవ భారతం

బానిస సంకెళ్ళు తెంచి స్వేఛ్ఛా వాయువుల్ని ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్యసమరయోధులు, అందరికీ వందనాలు

దేశంలోనైనా మనుగడ సాగించగలం, ఎవరితోనైనా సర్దుకుపోగలం , భిన్న వేషభాషలు అలవరచుకోగలం,కానీ మూస ధోరణికి భిన్నంగా మనమంటే ప్రత్యేక ముద్రవేసే సృజనాత్మకత కావాలి

టాటాల మొదలు, బిర్లా, మిట్టల్, అంబానీల వరకు ప్రపంచ ఆర్ధికస్థితినే శాసించగలిగే మేధావులు ఉన్నారు, కానీ నాణేనికి మరోవైపులా ఇంకా ఉన్న ఆకలి చావులను, ప్రాధమిక వైద్యం లేని ప్రదేశాలను రూపుమాపే మరో వందమంది మేధావులు రావాలి

మత్తగజము కంటే స్థిరమైన ఆర్ధిక స్థితిగల్గిన పలుప్రపంచదేశాలు ఆర్థికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నా, భారత ఆర్ధిక స్థితిని సరైన మార్గంలో నడిపించే చాణక్యులు ఉన్నారు, కానీ ప్రపంచ ఆర్ధికస్థితి నీలినీడలు భారతావనిని ప్రభావితం చేసే పరిస్థితిని దూరంచేసే నవచాణక్యులు పుట్టాలి

దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు గురజాడ అప్పారావుగారు, సూత్రాన్ని తూ|||| తప్పకుండా పాటించి భారతీయ ఖ్యాతిని నలుదిక్కులా వ్యాపింపచేసిన భారతీయులకు ఘనత సొంతం,

కానీ నవతరంలో ఉరకలు వేసే యువతరం భారతీయ కీర్తిని ప్రపంచ దేశాలంతా దిక్కులు పిక్కటిల్లేలా కొనియాడే విధంగా కృషిచేయాలని కోరుకొంటున్నాడీ సగటు భారతీయుడు….

No comments:

Post a Comment